హైదరాబాద్, 16 జూన్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని తాను చెప్పలేదని మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడుంటాయో వారంలో స్పష్టత వస్తుందని అన్నానని అన్నారు. కేబినెట్లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతానని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు బహిరంగంగా ప్రకటన చేయడంపై ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు స్పష్టత వస్తుందని భావిస్తున్నానని,బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలో ఇవాళ స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..