హైదరాబాద్, 16 జూన్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం చేరుకున్న మంత్రి వాకిటి శ్రీహరిని వేదమంత్రోచ్చారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తనకు కేటాయించిన చాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరికి మంత్రి జూపల్లితో పాటు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్