అమరావతి, 16 జూన్ (హి.స.)
ములుగు: ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పాణిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఆయనతో పాటు జూనియర్ అసిస్టెంట్ దిలీప్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు హర్జి వ్యక్తిగత కారణాలతో మూడు నెలలపాటు సెలవులో ఉన్నారు. సెలవులు పూర్తి కావడంతో తిరిగి విధుల్లో చేరేందుకు ములుగు డీఈవో కార్యాలయంలో రిపోర్టు చేశారు. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వడానికి ఉపాధ్యాయుడి నుంచి డీఈవో రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ప్రణాళిక ప్రకారం ఉపాధ్యాయుడు హర్జి.. డీఈవో పాణినికి రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలోని బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. డీఈవో, జూనియర్ అసిస్టెంట్ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ