అమరావతి, 16 జూన్ (హి.స.)
కురుపాం గ్రామీణం: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బురద గుంతలో దిగి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. కురుపాం మండలం బొడ్డమానుగూడకు చెందిన మండంగి జెస్సిక (8), బిడ్డిక సునంద(10) చేపలు పట్టేందుకు ఇటుకల తయారీ మట్టి కోసం తీసిన గుంతలోకి దిగారు. అందులోని బురదలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ