హైదరాబాద్, 17 జూన్ (హి.స.)
ప్రొ.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో నిన్న జరిగిన రైతు నేస్తం కార్యక్రమంపై సీఎం రేవంత్రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు . కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి సందర్భంగా రైతు దంపతులు వెంకటరామయ్య, లక్ష్మమ్మలను సీఎం అభినందించారు. వారితో ఫొటో దిగారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'వయసు మీదపడ్డా సాగులో అలసిపోని సేద్యపు సైనికులు ఈ పెద్దవ్వ, పెద్దయ్య. వ్యవసాయం అంటే సమాజానికి చేసే సాయం అని నమ్మే దంపతులు వీళ్లు. నేటి తరం రైతుకు ఆదర్శం వీళ్లు. వాళ్లతో దిగిన ఈ ఫొటో నాకు ఎప్పటికీ ప్రత్యేకం' అని రాసుకు వచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్