తెలంగాణ, రంగారెడ్డి. 17 జూన్ (హి.స.)
గత ప్రభుత్వం ధరణి పేరుతో
నల్లచట్టాన్ని తీసుకొచ్చి రైతుల కొంప ముంచిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు ఆరోపించారు. శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో వారు మాట్లాడుతూ పదేళ్లపాటు రైతులు ఎంతో నరకం అనుభవించారని స్పష్టం చేశారు. ధరణి చట్టంలో సమస్యలను అధికారుల స్థాయిలో పరిష్కరించేందుకు వీలు లేకపోవడం జిల్లా కలెక్టర్, కోర్టుల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించే వీలుండడంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఒకే సర్వే నంబర్ లో ఎంతోమంది రైతులకు వేరువేరు నంబర్లతో భూమి ఉండడం, అందులో ఒకరి భూమి సమస్య ఉంటే ఆ సర్వే నంబర్ లో ఉన్న రైతులందరికీ ఇబ్బంది కలిగేదని ఇలా 10 సంవత్సరాల పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు