హైదరాబాద్, 17 జూన్ (హి.స.)
హైదరాబాద్ లో డిఫెన్స్ మద్యం పట్టుబడింది.మల్కాజిగిరిలో 37 బాటిల్లు, మేడ్చల్ లో 24 బాటిల్ల మద్యం సీజ్ చేశారు అధికారులు. ఇద్దరు ఎక్స్ ఆర్మీ పర్సన్ల ను అరెస్ట్ చేశారు.
పట్టుబడినటువంటి టిఫిన్స్ మద్యం బాటిళ్లు కర్ణాటక చెందినవిగా గుర్తించారు.డిఫెన్స్ క్యాంటీన్ లో నెలవారీగా వచ్చే కోటాను కొంతమంది వద్ద బాటిల్లను కొనుగోలు చేసి ఎక్స్ సర్వీస్ మెన్ పురుషోత్తం యాప్రాల్ లో, ముప్పరపు సిద్దయ్య ఆర్మీ పర్సనల్ కౌకూర్ లో అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నట్లు ఏ ఎస్ బి ముకుంద రెడ్డి తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 75 వేలుగా ఉంటుందని అంచనా వేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..