ఎక్కడ అణచివేత,పీడనం, దోపిడీ ఉంటుందో.. అక్కడ ఉద్యమం ఉంటుంది.. సినీ నటుడు నారాయణమూర్తి
హైదరాబాద్, 17 జూన్ (హి.స.) ఎక్కడ అణచివేత,పీడనం, దోపిడీ ఉంటుందో.. అక్కడ ఉద్యమం ఉంటుందని అందుకు అడిగినోడు నక్సలైట్... అడగనోడు ఆల్ రైట్ ఆ .! అని సినీ నటులు ఆర్.నారాయణ మూర్తి ప్రశ్నించారు. శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ పేరిట సాగిస్తున్న హ
నారాయణమూర్తి


హైదరాబాద్, 17 జూన్ (హి.స.)

ఎక్కడ అణచివేత,పీడనం, దోపిడీ

ఉంటుందో.. అక్కడ ఉద్యమం ఉంటుందని అందుకు అడిగినోడు నక్సలైట్... అడగనోడు ఆల్ రైట్ ఆ .! అని సినీ నటులు ఆర్.నారాయణ మూర్తి ప్రశ్నించారు. శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ పేరిట సాగిస్తున్న హత్యాకాండను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద నేడు భారీ స్థాయిలో మహాధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు, వివిధ పార్టీల నాయకులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. చంపాల్సింది అణిచివేతను, దోపిడిని అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమాజంలో శాంతిని కాపాడి ప్రజలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, రాజ్యాంగపరమైన హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం, సిపిఐఎంఎల్ నేతలు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తమ్మినేని వీరభద్రం, వేములపల్లి వెంకటరామయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వరరావు, వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande