, హైదరాబాద్, 17 జూన్ (హి.స.)
: వానాకాలం సీజన్కు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుభరోసా నిధుల విడుదల ప్రారంభమైంది. సోమవారం తొలిరోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుభరోసా జమ చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 41.25 లక్షల మంది రైతులకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్లు జమచేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ