హైదరాబాద్, 17 జూన్ (హి.స.)
మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని క్రమంగా కోలుకుంటుంది.. కాగా
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ నేడు ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి సోమాజీగూడ లోని సత్యవతిరాథోడ్ ఇంటికి చేరుకొని పరామర్శించింది.
కాలు నొప్పిని సహితం మరిచిపోయి మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ఎదురేగి శోభమ్మను ఆహ్వానించింది.
త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో క్రియాశీల వ్యవహారాల్లో బాగం కావాలని మాజీమంత్రి సత్యవతిరాథోడ్ కు చెప్పిన శోభమ్మ.., కుటుంబసభ్యులను కూడా పలకరించి.., అమ్మ ను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తిరిగి వెల్లిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్