హైదరాబాద్, 17 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ చీఫ్ మరోసారి లేఖ రాశారు. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు కమిషన్ లేఖ రాసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్ కు కమిషన్ లేఖ రాసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి... ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదు. క్యాబినెట్ మినిట్స్ కమీషన్ కు ఇవ్వాలా?, వద్దా అనే అంశాన్ని క్యాబినెట్లో ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..