హైదరాబాద్, 17 జూన్ (హి.స.) టూరిజం ప్లాజా హోటల్స్ లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో మంగళవారం ఉదయం మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్లో ఆహార పదార్థాలు, కిచెన్ను పరిశీలించారు.అల్ఫాహారం చేస్తున్న పర్యాటకులు, అతిథిలతో మంత్రి జూపల్లి మాట్లాడారు. ఆహారం నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హరిత హోటల్స్లో సౌకర్యాలు, ఆహార నాణ్యతపై నిరంతరం పరిశీలన కొనసాగిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, అతిథుల కోసం మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పనపై ప్రదానంగా దృష్టి పెడుతున్నామని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్