హైదరాబాద్ మెట్రో .రైలు.రెండో దశ.ప్రాజెక్టుకు 19,579 తో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి
, హైదరాబాద్‌ 17 జూన్ (హి.స.) : హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ(బి) ప్రాజెక్ట్‌కు రూ.19,579 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారిడార్‌ 9లో రాజీవ్‌గాంధీ అంత
హైదరాబాద్ మెట్రో .రైలు.రెండో దశ.ప్రాజెక్టుకు 19,579 తో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి


, హైదరాబాద్‌ 17 జూన్ (హి.స.)

: హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ(బి) ప్రాజెక్ట్‌కు రూ.19,579 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారిడార్‌ 9లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌సిటీ(స్కిల్స్‌ యూనివర్సిటీ) వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్‌ 10లో జేబీఎస్‌ నుంచి మేడ్చల్‌ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్‌ 11లో జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్లు మొత్తం 86.1 కిలోమీటర్లు చేపట్టనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 30శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతం, జైకా, ఏడీబీ, ఎన్డీబీ నుంచి రుణం వాటా 48 శాతం, పీపీపీ కాంపోనెంట్‌ 4 శాతంగా పేర్కొన్నారు. త్వరలో పరిపాలన అనుమతిని డీపీఆర్‌కు జత చేసి కేంద్రానికి పంపనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande