హైదరాబాద్, 17 జూన్ (హి.స.)
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను స్పీడప్ చేసింది. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 400 నుంచి 600 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వెలుగులోకి రావడంతో బాధితుల నుంచి అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ (మంగళవారం) ఉదయం కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్ లోని సిట్ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ హాజరై సిట్ ఎదుట ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఎంపీ అనిల్కుమార్ యాదవ్ చైర్పర్సన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి సరిత కూడా హాజరయ్యారు. వారి స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఈ కేసులో సాక్షులు, బాధితుల వాంగ్మూలాలే కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్