హైదరాబాద్, 17 జూన్ (హి.స.)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
ధర్నాతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న బస్ భవన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం స్టూడెంట్ బస్ పాసుల చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బస్ పాస్ ఛార్జీల పెంపు.. పేద, మధ్య తరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్