తెలంగాణ, వికారాబాద్. 17 జూన్ (హి.స.) వికారాబాద్ జిల్లా
తాండూరుల రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇసుక మాఫియా పై మంగళవారం తాండూరు పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కి ఫిర్యాదు చేశారు. సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తాండూరు కాగ్న నది నుండి అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణా యదేచ్చగా కొనసాగుతుందన్నారు.
అక్రమ ఇసుక రవాణా పై ఫిర్యాదు చేసిన వారి పై దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు తాండూరు పట్టణంలోకి అతివేగంగా రావడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. అధికార పార్టీ అండతో కొందరు వ్యక్తులు ఖనిజ సంపదను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు