తెలంగాణ, వికారాబాద్. 17 జూన్ (హి.స.) తమకు రావలసిన స్టైఫండ్ కోసం రెండో రోజు మెడికోలు దీక్షను కొనసాగిస్తున్నారు. ఇవాళ (మంగళవారం) మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ నందు ఎంబీబీఎస్ పూర్తి అయి ఇంటర్న్షిప్ చేస్తున్న మెడికోలు, (పీజీ) పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు స్టైఫండ్ కోసం నిరసన చేస్తున్నారు. తమ స్టైఫండ్లను చెల్లించకుండా కాలేజీ యజమాన్యం బెదిరిస్తోందని మెడికోలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిష్కారం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మెడికోలు కోరుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు