మెహబూబా బ్యాడ్ జిల్లాలో ఘోర రోడ్డు.ప్రమాదం చోటుచేసుకుంది
మహబూబాబాద్, 17 జూన్ (హి.స.)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో 7 మంది గాయాలపాలయ్యారు. మహబూబాబాద్ -కేసముధ్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం వేం నూరు గ్రామ శివారు నేతాజీ తండా వద్ద
మెహబూబా బ్యాడ్ జిల్లాలో ఘోర రోడ్డు.ప్రమాదం చోటుచేసుకుంది


మహబూబాబాద్, 17 జూన్ (హి.స.)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో 7 మంది గాయాలపాలయ్యారు. మహబూబాబాద్ -కేసముధ్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం వేం నూరు గ్రామ శివారు నేతాజీ తండా వద్ద అశోక్ లీలాండ్ వాహనాన్ని గ్రానెట్ లారీ డీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుగులోత్ రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన నెల్లికుదుర్ మండలం మీట్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని పంతులు తండాకు చెందినవారు. ఇల్లందు సమీపంలో మిర్యాలపెంట గ్రామంలో శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande