నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
నాగర్ కర్నూల్, 17 జూన్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంత కోడూరు గ్రామానికి చెందిన లింగం గౌడ్(45) అన
రోడ్డు ప్రమాదం


నాగర్ కర్నూల్, 17 జూన్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంత కోడూరు గ్రామానికి చెందిన లింగం గౌడ్(45) అనే వ్యక్తిని నేడు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande