తిరుమల , 17 జూన్ (హి.స.)వేసవి సెలవులు ముగిసినప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో భక్తుల రద్దీ (Crowd of devotees)ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇటీవల రైల్వే శాఖ సర్వీసులను అధికం చేయడంతో తిరుమలకు ప్రయాణం ఈజీ అయింది. తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. దీంతో తిరుమలలో గత 20 రోజులుగా భక్తు రద్దీ కొనసాగుతూనే ఉంది. గతంలో వీకెండ్స్లో మాత్రమే భక్తుల రద్ధీ ఉండేది. కానీ ప్రస్తుతం.. వారం తో సంబంధం లేకుండా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు.
ఈ క్రమంలో సోమవారం స్వామివారిని రికార్డు స్థాయిలో 84,681 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. దీంతో నిన్న ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి