న్యూఢిల్లీ, 17 జూన్ (హి.స.)జూన్ 16: రైల్వేలో ఖాళీగా ఉన్న 6,374 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. సిగ్నల్, టెలికమ్యూనికేషన్ సహా 51 కేటగిరీల్లోని గ్రేడ్ -సి పోస్టులు భర్తీ కానున్నాయి. దేశంలోని 17 జోన్లు, ఉత్పాదక యూనిట్లలో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రస్తుతం పేర్నొన్న పోస్టుల సంఖ్య కన్నా ఇంకా ఎక్కువ ఖాళీలు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. సిగ్నల్, టెలికాం విభాగంలో చివరిసారిగా 2017లో పోస్టుల భర్తీ జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు