డిల్లీ, 18 జూన్ (హి.స.)భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తామే ఆపామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పదేపదే చాటుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర చర్చే నడిచింది. ట్రంప్ ప్రకటనపై స్పష్టతనివ్వాలని అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. ఈక్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తొలిసారిగా దీనిపై స్పందించారు. భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడికి స్పష్టంగా చెప్పినట్లు కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
‘‘జీ7 శిఖరాగ్ర సదస్సు అనుబంధంగా ప్రధాని మోదీ-ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే, అమెరికా అధ్యక్షుడు ముందుగానే వెళ్లిపోవడంతో వీరు సమావేశం కాలేకపోయారు. అనంతరం వీరిద్దరూ 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ట్రంప్.. మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో అండగా ఉంటామన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు