హైదరాబాద్, 18 జూన్ (హి.స.) వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్లకు సువర్ణవకాశం కల్పించింది. ఇక నుంచి కేవలం రూ.3 వేలు చెల్లిస్తే ఏడాదిలో దేశంలో ఎక్కడైనా.. ఏ టోల్ గేట్ల వద్దైనా 200 ట్రిప్పుల ప్రయాణం చేసేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇవాళ బుధవారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి దేశ వ్యాప్తంగా ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ప్లాట్ఫాం 'X' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..