నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
ముంబై, 18 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 81,237 వద్ద కనిష్టాన్ని తాకిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 138.64 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 41.35 పాయింట్లు లేదా 0.17 శా
stockmarkets


ముంబై, 18 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 81,237 వద్ద కనిష్టాన్ని తాకిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 138.64 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 41.35 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 24,812.05 వద్ద ముగిసింది.

విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.46 శాతం, 0.23 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మీడియా 1.27 శాతం నష్టపోగా, నిఫ్టీ ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రియల్టీ, ఎనర్జీ, పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande