అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 175 దేశాల.నుంచి ప్రతినిధులు హాజరు
విశాఖపట్నం, 19 జూన్ (హి.స.) :విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని విశాఖ జిల్లా ఇన్‌చార్జి175 మంత్రి డోలా శ్రీబా
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 175 దేశాల.నుంచి ప్రతినిధులు హాజరు


విశాఖపట్నం, 19 జూన్ (హి.స.)

:విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని విశాఖ జిల్లా ఇన్‌చార్జి175 మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ నుంచి భీమిలి వరకూ 29.8 కి.మీ. పొడవున కార్యక్రమం నిర్వహిస్తామని, ఒక్క బీచ్‌ రోడ్డులోనే 3.26 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. ఇంకా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం ఐదు లక్షల మంది అవుతారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande