తెలంగాణ, మహబూబ్ నగర్ 19 జూన్ (హి.స.)
భారత యుద్ధరంగంలో
ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ, దాని అనుబంధ సంస్థల ఏర్పాటుకు గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, డీఆర్డీఎల్ శాస్త్రవేత్తలతో కలిసి దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, బస్వాయ పల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా దేవరకద్రకు వచ్చిన జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ డాక్టర్ జైతీర్థ్ జోషి, డీఆర్డీఎల్ డైరెక్టర్ డాక్టర్ జి.ఏ శ్రీనివాస్ మూర్తి, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.సాంబశివ ప్రసాద్ ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు