అమరావతి, 19 జూన్ (హి.స.)
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఇద్దరు వృద్ధ మహిళల హత్య కలకలం రేపింది. పరిమిరోడ్డులో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, అంజమ్మ హత్యకు గురయ్యారు. వీరిద్దరూ వియ్యపురాళ్లు కాగా.. ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 3 గంటల సమయంలో వృద్ధులు చనిపోయినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో పెనుగులాట జరిగినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. బంగారం కోసమే ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెనాలిలో జరిగిన ఓ శుభకార్యానికి ఇద్దరూ వెళ్లి వచ్చారు. ఆ తర్వాతే హత్య జరిగినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబసభ్యులు వచ్చాక ఇంట్లో చోరీ విషయమై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు మహిళల తలకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ