అమరావతి, 19 జూన్ (హి.స.)
విశాఖపట్నం: ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై విశాఖపట్నం బీచ్ రోడ్డులో వాకథాన్ నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు డీబీవీ స్వామి, సత్యకుమార్, బీసీ జనార్దన్రెడ్డి, సవిత, యోగా దినోత్సవ నోడల్ అధికారి కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద ప్రజలతో కలిసి మంత్రులు, అధికారులు యోగాసనాలు వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ