హైదరాబాద్, 19 జూన్ (హి.స.)ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025 ను పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో ఉక్కు మరియు బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో జూన్ 20న ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే 24 గంటల కౌంట్డౌన్ వేడుకలకు భారీ ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎల్బీ స్టేడియాన్ని సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు.
కార్యక్రమ నిర్వహణ, భద్రత, బహిరంగ సదుపాయాలు, వేదిక ఏర్పాట్లపై అవసరమైన సూచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు