పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్, 19 జూన్ (హి.స.)ఈ విద్యా సంవత్సరం 202-26 ఇంజనీరింగ్ కాలేజ్ ల ఫీజు పెంపు లేనట్టే.. పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజుల పెంపు విషయంలో కాలేజీలు ఇచ్చిన రిపోర్టులు, కాలేజీల్లో ఉన్న వసతులై అధ్యయనం చేసేందుకు సబ
పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


హైదరాబాద్, 19 జూన్ (హి.స.)ఈ విద్యా సంవత్సరం 202-26 ఇంజనీరింగ్ కాలేజ్ ల ఫీజు పెంపు లేనట్టే.. పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజుల పెంపు విషయంలో కాలేజీలు ఇచ్చిన రిపోర్టులు, కాలేజీల్లో ఉన్న వసతులై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీ వేయాలని AFRC నిర్ణయం తీసుకుంది. గతంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టును స్టడీ చేయాలని AFRC ప్లాన్ చేస్తుంది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరవాతే ఫీజుల పెంపుపై సహేతుకంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. ఇక, అధ్యయనం చేసి ఫీజులు ఖరారు చేసేందుకు టైమ్ పడుతుంది.. ఆగస్టు 14వ తేదీలోపు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యం లో.. పాత ఫీజులతోనే ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande