హైదరాబాద్, 19 జూన్ (హి.స.) కేబినెట్ ఆమోదం లేకుండా
కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం
నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్.. కేబినెట్ లో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ నిర్ణయం తీసుకున్న కేబినెట్ ఆమోదం తీసుకుంటారని.. తాను బీజేపీ ఎంపీగా కాకుండా నాటి మంత్రిగా చెబుతున్నానని ఎంపీ ఈటల స్పష్టం చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించిన ఈటల.. ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం నిర్ణయాలు తీసుకోలేదని, ఆనాడు కేసీఆర్ కేబినెట్లో ఉన్న ముగ్గురు మంత్రులు ఇప్పుడు మీ సీఎం పక్కనే ఉన్నారని, అవసరమైతే వారిని అడిగితే స్పష్టంగా చెప్తారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్