అమరావతి, 19 జూన్ (హి.స.)
అమరావతి,): రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు. అమరావతి సహా పలు ఎయిర్పోర్టుల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. సాగరమాల కింద చేపడుతున్న పనుల పర్యవేక్షణ కోసం వచ్చేనెల 4న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులతో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. బుధవారం విజయవాడలో మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ