విశాఖపట్నం, 19 జూన్ (హి.స.) ):రాష్ట్రంపైకి నైరుతి వైపు నుంచి గాలులు వీచినా.. పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగాయి. కోస్తాతోపాటు దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లో బుధవారం ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. జంగమహేశ్వరపురంలో 40.1, తిరుపతిలో 39.4, కావలిలో 38.8, నెల్లూరులో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కాగా, పశ్చిమబెంగాల్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ