నల్లగొండ జిల్లా, 21 జూన్ (హి.స.)
, నకిరేకల్ మండలం, నోముల గ్రామంలోదారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ జానయ్య (34) అనే వ్యక్తిని కొందరు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడంతో.. తీవ్ర గాయాలు అయ్యాయి. జానయ్యను నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మరణించాడు. ఈ ఘటనకు వివాహహేతర సంబంధమే కారణం అయి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని వారు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ