హైదరాబాద్, 22 జూన్ (హి.స.)
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పై ఎస్ సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఇటీవల జరిగిన సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఆ వేడుకలో విజయ్ మాట్లాడుతూ గిరిజనులను తీవ్రవాదులతో పోల్చాడు. విజయ్ దేవరకొండ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. దాంతో గిరిజన సంఘాలు విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసారు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్. గిరిజన సంఘాల ఫిర్యాదుతో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..