ప్రకృతి.. ప్రగతి సంగమ స్థలి విశాఖ.. యోగాంధ్రా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్టణం , 21 జూన్ (హి.స.)ప్రకృతి, ప్రగతి సంగమ స్థలి విశాఖ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ విశాఖ తీరానా యోగాంధ్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముందుగా కార్యక్రమానికి హాజరైన అందరికీ యోగాడే శుభాకాంక్షలు తెలిపారు. యోగా ప్రపంచాన్ని కల
ప్రకృతి.. ప్రగతి సంగమ స్థలి విశాఖ.. యోగాంధ్రా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ


విశాఖపట్టణం , 21 జూన్ (హి.స.)ప్రకృతి, ప్రగతి సంగమ స్థలి విశాఖ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ విశాఖ తీరానా యోగాంధ్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముందుగా కార్యక్రమానికి హాజరైన అందరికీ యోగాడే శుభాకాంక్షలు తెలిపారు.

యోగా ప్రపంచాన్ని కలిపిందని.. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి తెలిపారు. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని అన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అంటూ అభివర్ణించారు. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందని గుర్తు చేశారు. నేడు ప్రతి గ్రామంలో యువకు నుంచి వృద్ధుల వరకు యోగాను అనుసరిస్తున్నారు. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది జీవన శైలిని యోగా మార్చిందని అన్నారు. నేడు విశాఖ తీరంలో నేవీకి చెందని నౌకల్లో కూడా యోగాసాలు వేస్తున్నారని తెలిపారు. ప్రగతి, ప్రకృతి సంగమ స్థలి విశాఖ అని కొనియాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్వహించినందుకు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్‌ను అభినందించారు. ‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’ థీమ్‌తో ఈసారి యోగా డేను జరుపుకుంటున్నామని అన్నారు. ప్రపంచంతో మనం అనుసంధానం కావడానకి కూడా యోగానే మార్గమని పేర్కొన్నారు. యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. యోగాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇకో సిస్టమ్‌ను కూడా డెవలప్‌ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో యోగా గురించి ‘మన్‌ కీ బాత్‌’లో కూడా విస్త్రృతంగా చర్చించానని తెలిపారు. అందరి క్షేమమే నా కర్తవ్యమని భారతీయ సంస్కృతి నేర్పుతుందని అన్నారు. ప్రపంచ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటునే ఉందని.. ఈ పరిస్థితుల్లో యోగా శాంతికి తోడ్పడుతోందని.. యోగా మనలో మానవత్వం పెంచుతోందని తెలిపారు. వ్యక్తిగత క్రమశిక్షణ యోగా ఒక అద్భుత సాధానమని అన్నారు. నేటి నుంచి మనం అనే భావనను తీసుకెళ్లే ఆయుధం అదేనేనని నొక్కి చెప్పారు. ఒకేసిటీ అనేది ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిందని.. తీసుకునే ఆహారంలో నూనె పదార్థాలను 10 శాతం తగ్గించాలని సూచించారు. వ్యక్తిగత క్రమశిక్షణకు యోగా ఒక అద్భుత సాధనమని ప్రధాని మోడీ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande