రైల్వే ట్రాక్ పై కారు నడుపుతూ.. హల్చల్ సృష్టించిన యువతి
హైదరాబాద్, 26 జూన్ (హి.స.) రైల్వే ట్రాక్ పై ఓ యువతి కారు నడుపుతూ.. హల్చల్ సృష్టించిన ఘటన శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. కొండకల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు రైలు పట్టాలపై ఓ యువతి కారు నడుపుకుంటూ వచ్చింది. పట్టా
రైలు పట్టాలపై కారు


హైదరాబాద్, 26 జూన్ (హి.స.)

రైల్వే ట్రాక్ పై ఓ యువతి కారు

నడుపుతూ.. హల్చల్ సృష్టించిన ఘటన శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. కొండకల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు రైలు పట్టాలపై ఓ యువతి కారు నడుపుకుంటూ వచ్చింది.

పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్ చేసింది. రీల్స్ మోజులో రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది. గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. దీంతో వారిని చాకుతో బెదిరించింది.

సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిసింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. కాగా, యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తున్నది.

ట్రాక్పై అకస్మాత్తుగా కారును గమనించిన లోకో పైలెట్ రైలును ఆపేశాడు. దీంతో గంటల తరబడి పలు ట్రైన్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ఫిర్యాదు మేరకు శంకర్పల్లి పోలీసులు స్పాట్కు చేరుకుని యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande