అమరావతి, 26 జూన్ (హి.స.) రాజమండ్రి: పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు ( )కు ఇవాళ(గురువారం) ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ( ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు , కందుల దుర్గేష్ (, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్థానిక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం అన్నారు. అలాగే డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్యకు జన్మనిచ్చిన నేల గోదావరి ప్రాంతమని పేర్కొన్నారు. మరోవైపు రూ.430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ