అమరావతి, 26 జూన్ (హి.స.)
, అమరావతి: ఇమిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే ఈ-పాస్పోర్టుల జారీ మన రాష్ట్రంలోనూ అమల్లోకి వచ్చింది. తొలుత విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలో ఆరంభించగా, గత నెల నుంచి విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలో కూడా జారీ మొదలుపెట్టారు. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం (పీఎస్పీ) వెర్షన్ 2.0లో భాగంగా కేంద్రం ఈ-పాస్పోర్టుల జారీ అమల్లోకి తెచ్చింది. ఇంతకాలం అందజేస్తున్న పాస్పోర్ట్స్ స్థానంలో.. కొత్తగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లను జారీచేస్తున్నారు. ఇందులో పాస్పోర్ట్దారు సమగ్ర సమాచారం ఉంటుంది. దీనిని అధికారులు రీడ్ చేస్తే.. అందులోని వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల ఇమిగ్రేషన్ ప్రక్రియ సులువుగా ముగుస్తుంది.
నకిలీలకు అవకాశం లేకుండా..: ఈ-పాస్పోర్ట్లో బయటకు కనిపించకుండా చిప్ ఉంటుంది. పాస్పోర్ట్ మొదటి పేజీలో ఓ కోడ్ ఉంటుంది. దానిని రీడ్ చేస్తే.. వివరాలన్నీ తెలిసిపోతాయి. పాత పాస్పోర్ట్స్ స్థానంలో నకిలీవి తయారుచేసేందుకు అవకాశం ఉండేది. ఈ-పాస్పోర్ట్లో ఇందుకు అవకాశం ఉండదు. కొత్తగా జారీచేస్తున్న ఈ-పాస్పోర్ట్పై బంగారం రంగులో చిప్ రూపంలో ఓ చిహ్నం ఉంటుంది.
పాత పాస్పోర్ట్స్ మార్చుకోవాలంటే..: విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పరిధిలో మే 4 నుంచి ఈ-పాస్పోర్ట్స్ జారీ మొదలుపెట్టగా, ఇప్పటికి 25,000 జారీ చేశారు. పాత పాస్పోర్ట్దారులకు వాటికి కాలపరిమితి ఉన్నంతవరకు అవి మనుగడలో ఉంటాయి. రెన్యువల్ సమయంలో ఈ-పాస్పోర్ట్ జారీచేస్తారు. ఇప్పుడే పాత పాస్పోర్ట్ స్థానంలో ఈ-పాస్పోర్ట్ పొందాలనుకుంటే.. రీ ఇష్యూ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని,
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ