యాంటీ నార్కోటిక్స్ సందర్భంగా గుంటూరు లో.నిర్వహించిన.వాక దాన్ లో పాల్గొన్న సీఎం.చంద్రబాబు
అమరావతి, 26 జూన్ (హి.స.) : యాంటీ నార్కోటిక్స్‌ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి రోడ్డులోని ఫీవర్‌ ఆసుపత్రి నుంచి చిల్లీస్‌ జంక్షన్‌ వరకు నిర్వహించిన వాక్‌థాన్‌ ప్రదర్శనలో సీఎం పాల్గొన్నారు. కా
యాంటీ నార్కోటిక్స్ సందర్భంగా గుంటూరు లో.నిర్వహించిన.వాక దాన్ లో పాల్గొన్న సీఎం.చంద్రబాబు


అమరావతి, 26 జూన్ (హి.స.)

: యాంటీ నార్కోటిక్స్‌ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి రోడ్డులోని ఫీవర్‌ ఆసుపత్రి నుంచి చిల్లీస్‌ జంక్షన్‌ వరకు నిర్వహించిన వాక్‌థాన్‌ ప్రదర్శనలో సీఎం పాల్గొన్నారు. కాసేపట్లో.. శ్రీకన్వెన్షన్‌లో విద్యార్థులు, యువతతో జరిగే ముఖాముఖి సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, హోం మంత్రి వంగలపూడి అనిత తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఈగల్‌ను స్థాపించి గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ఉక్కుపాదం మోపడంతో పాటు డ్రగ్స్‌ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande