తెలంగాణ, ఖమ్మం. 26 జూన్ (హి.స.)
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదకద్రవ్యాల నిర్ములన అవగాహన ర్యాలీని గురువారం వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… యువత పురోగతికి, భావి జీవితానికి అవరోధంగా నిలుస్తున్న మాధకద్రవ్యాలను సమాజం నుండి సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు