'భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను'ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, 26 జూన్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం నెదర్లాండ్స్ ని హేగ్లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ
ట్రంపు


న్యూఢిల్లీ, 26 జూన్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం నెదర్లాండ్స్ ని హేగ్లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సహా ప్రపంచంలో చోటుచేసుకున్న అనేక యుద్ధ స్థితులను తానే అడ్డుకున్నానని, వాటిని శాంతియుత మార్గాల్లో పరిష్కరించానని గర్వంగా ప్రకటించారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితిని తానే ఆపానని మరోసారి వ్యాఖ్యనించారు. ఇరు దేశాధినేతలకు వరుస ఫోన్ కాల్స్ చేసి 'మీరు ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తే, అమెరికా ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేయదు' అని హెచ్చరించానని పేర్కొన్నారు. ఇదే కారణంగా ఉభయ దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాయని, తాను అణు యుద్ధాన్ని అడ్డుకున్నానని చెప్పారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande