న్యూఢిల్లీ, 26 జూన్ (హి.స.)అండమాన్ సముద్రంలో 4.2 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. అయితే ఈ ఘటనతో ప్రాణనష్టం లేదని అధికారులు వెల్లడించారు. అయితే, ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. పోర్ట్ బ్లేర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం నమోదయింది. పోర్ట్ బ్లేర్ దగ్గరలో సముద్రంలో 4.2 తీవ్రతతో భూకంపం బుధవారం తెల్లవారుజామున సంభవించింది. ఈ విషయాన్ని భారత జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం (NCS) అధికారికంగా వెల్లడించింది.
ఈ భూకంపం జూన్ 25, 2025 ఉదయం 1:43:50 IST సమయంలో సంభవించింది. దీని తీవ్రత 4.2 రిక్టర్ స్కేల్పై నమోదయింది. Lat: 9.46 N, Long: 94.07 E వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు.అండమాన్ సముద్రంలోని 20 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం ఏర్పడింది. ఈ సమాచారాన్ని జాతీయ భూకంప కేంద్రం సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. ఈ భూకంపం వల్ల ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భూకంపం తక్కువ తీవ్రతతో ఉన్న కారణంగా
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు