న్యూఢిల్లీ, 26 జూన్ (హి.స.)
కొన్ని దేశాలకు క్రాస్ బార్డర్ టెర్రరిజం ఓ పాలసీగా మారిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ చైనాలో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ మంత్రుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాయాది పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలు ఎన్నటికీ అభివృద్ధి బాటపట్టలేవని అన్నారు. పాక్ లక్ష్యంగా చేసుకుని కొన్ని దేశాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని విధాన సాధనంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. ఆ దేశం బాహాటంగానే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పింస్తుందని ఫైర్ అయ్యారు. అలాంటి దేశాలను NOC ముక్తకంఠంతో విమర్శించడానికి వెనుకాడకూడదని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..