న్యూఢిల్లీ, 26 జూన్ (హి.స.ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలు దాని కిందే పనిచేస్తాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్ వ్యాఖ్యానించారు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రీన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్కు అధికారాలున్నాయి. కానీ, రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదన్నారు. భారత 52వ సీజేఐగా గవాయ్ గత నెల బాధ్యతలు స్వీకరించారు. తూర్పు మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో ఏది అత్యున్నతమైందని తరచూ చర్చ తలెత్తుతోందని గవాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘ చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందని అంటారు. కానీ, నా ఉద్దేశంలో భారత రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైంది. ప్రజాస్వామ్యంలోని మిగిలిన మూడు విభాగాలు దానికిందే పనిచేస్తాయి. మనం విధులు నిర్వహిస్తున్నామని న్యాయమూర్తులు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. మనం ప్రజల హక్కులకు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులం. కేవలం మనకు అధికారం మాత్రమే లేదు. బాధ్యతలు కూడా ఉన్నాయి. తీర్పుల గురించి ప్రజలు ఏమనుకొంటున్నారు అన్నది జడ్జీలను ప్రభావితం చేయకూడదు. మనం స్వతంత్రంగా ఆలోచించాలి’’ అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు