అమరావతి, 26 జూన్ (హి.స.)
, హైదరాబాద్: ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీములంటూ వందలాది మందిని ముంచి రూ.కోట్లు వసూలు చేసిన వైకాపా నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కుమారుడు, ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ లక్ష్మీ విజయ్కుమార్ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు నెల రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని వందలాది మంది నుంచి రూ.8 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. పరారీలోని ఇతర నిందితుల ఆచూకీ, దుర్వినియోగం చేసిన నిధుల లెక్క తేల్చేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్, ఏసీపీ హుస్సేన్నాయుడు బుధవారం వివరాలు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ