బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. అమ్మవారికి తొలి సారె సమర్పించిన ఈవో
విజయవాడ, 26 జూన్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే వారాహి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీ శీనానాయక్ దంపతులు అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. మ
బెజవాడ కనకదుర్గ ఆలయం


విజయవాడ, 26 జూన్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే వారాహి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీ శీనానాయక్ దంపతులు అమ్మవారికి తొలి సారెను సమర్పించారు.

మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు, అమ్మవారికి శేష వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ మాట్లాడుతూ, తమ చేతుల మీదుగా అమ్మవారికి తొలి సారె సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు సారె సమర్పణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande