తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన రద్దీ
తిరుమల, 26 జూన్ (హి.స.) తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో గత రెండు నెలలుగా భక్తుల రద్దీ (Crowd of devotees) విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. వేసవి సెలవులకు తోడు, ప్రయాణం సులభం కావడంతో నిత్యం వేల సంఖ్యలో తిరుమలకు చేరుక
తిరుమల


తిరుమల, 26 జూన్ (హి.స.)

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో గత రెండు నెలలుగా భక్తుల రద్దీ (Crowd of devotees) విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.

వేసవి సెలవులకు తోడు, ప్రయాణం సులభం కావడంతో నిత్యం వేల సంఖ్యలో తిరుమలకు చేరుకుని వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో దాదాపు గత 50 రోజులుగా నిత్యం భక్తులతో కిటకిటలాడిన తిరుమల కొండ.. అమావాస్య ఎఫెక్ట్ కారణంగా బోసిపోయింది. ముఖ్యంగా అమావాస్య రోజు భక్తులు శైవాలయాలకు వెళ్లడం ఆనవాయితీగా ఉండటంతో.. తిరుమలకు భక్తుల రద్ధీ తగ్గినట్లు తెలుస్తోంది. బుధవారం అమావాస్య కావడంతో ప్రజలు తమ ప్రయాణాలు నిలిపివేసుకుంటారు. దీంతో గురువారం తెల్లవారుజామున తిరుమల కొండపై భక్తుల రద్ధీ భారీగా తగ్గిపోయింది.

దీంతో క్యూలైన్లు కాలీగా ఉన్నప్పటికి.. పలు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండటంతో.. వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న స్వామివారిని 75,001 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా వెంకటేశ్వర స్వామి వారికి 3.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయితే వరుసగా మూడు రోజులు పాటు భారీ వర్ష సూచనలు ఉండటంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త అనే చెప్పాలి.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande