తెలంగాణ,పెద్దపెల్లి. 27 జూన్ (హి.స.)
రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కూనారం ఆర్వోబీ వద్ద క్లస్టర్ విరిగిపోవడంతో ఇరువైపులా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖాజీపేట, బలర్షా రైల్వే మార్గంలో ఎక్కడికక్కడ రైలు నిలిచిపోయాయి.తెల్లవారుజాము నుండి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రాఘవపూర్ వద్ద నిలిచిపోయింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.రైల్వే అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు