తిరుమల, 27 జూన్ (హి.స.)
తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) ముఖ్య గమనిక ప్రకటించింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని తెలిపింది. ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్లి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తుల(Devotees)కు పడి గంటలు పడుతుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లోకి వెళ్తున్న వారికి15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.ప్రస్తుతం భక్తులు 26 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారని, తెలిపారు. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని భక్తులు గమనించాలని పిలుపునిచ్చారు. గురువారం శ్రీవారిని 64,879 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,960 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.09 కోట్లు కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి